ప్రియదర్శి బైక్ చోరీ.. నెట్టింట్లో హంగామా!

ప్రియదర్శి బైక్ చోరీ.. నెట్టింట్లో హంగామా!
x
Highlights

సినిమా షూట్‌లో సినీ హీరోకు చిన్న గాయమైనా, సినీ నటుల గురించి ఏ చిన్న విషయం తెలిసినా, వెంటనే ఆ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. అలాంటిది ఏకంగా ఓ సినిమా...

సినిమా షూట్‌లో సినీ హీరోకు చిన్న గాయమైనా, సినీ నటుల గురించి ఏ చిన్న విషయం తెలిసినా, వెంటనే ఆ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. అలాంటిది ఏకంగా ఓ సినిమా హీరో బైక్ చోరీ అయింది అంటే ఇంకేముంది? అలాంటి వార్తే ఇప్పుడు కలకలం రేపింది. మల్లేశం సినిమా హీరో ప్రియదర్శి బైక్‌ చోరీకి గురైంది. ఇంటి ముందు పార్క్‌ చేసిన బుల్లెట్‌ వాహనాన్ని ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఈ బైక్‌ మల్లేశం మూవీలో కూడా ఉపయోగించారు. మూవీ కంటే ముందే ఈ బైక్‌ను ప్రియదర్శి కొనుగోలు చేశారు. సీసీ టీవీలో బైక్‌ దొంగతనం చేసిన దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. దీంతో ప్రియదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ముందు పార్క్ చేసిన నా బుల్లెట్‌ను దొంగలించకుపోయారు అని ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రియదర్శి వీడియోతో కూడిన ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేశాడో లేదో, ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ తెగ ఫీల్ అయ్యారు. అయ్యో! మా హీరో బైక్ ఎత్తుకెళ్లిపోయారే అని చింతించారు. కానీ అసలు విషయానికి వోస్తే అసలు పియదర్శి బైక్ చోరీయే కాలేదట. ఆ బైక్ ని తీసుకెళ్లింది ఎవరో కాదు టాలీవుడ్ లో మరో హోరోనేనట.

అయితే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో కూడా క్లుప్తంగా వివరించాడు. టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జీటిక్ హీరో సందీప్ కిషన్ ట్వీట్ ద్వారా అసలు ముచ్చట బయటపెట్టిండు. సందీప్ కిషన్ ట్వీట్టర్ ద్వారా స్పందిస్తూ అసలు బైక్ తీసుకెళ్లడం ఇంత పెద్ద ఇశ్వు అవుతుందని అనుకోలేదని నిను వీడని నీడని నేనే' సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రియదర్శి బైక్ ని తీసుకెళ్లామని ప్రియదర్షి డేట్స్ ఇవ్వనందుకు ఈ పని చేశామని సందీప్ పెర్కోన్నారు. ఈ బైక్ ప్రమోషన్స్‌లో స్పెషల్ అట్రాక్షన్ అని, ప్రియదర్శి బైక్ నడపటం నాకు బాగా నచ్చింది అని, లవ్ యు దర్శిఅంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన వారు ఒక్కసారిగా ఊపిరి పిల్చుకున్నారు. నిజంగా పియ్రదర్శి బైక్ పోయింది అనుకుని చాలా బాధపడ్డాం. సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేశారా అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ప్రియదర్శి ట్వీట్ చేసిన కాసేపటికే సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. అసలు విషయాన్ని వివరించాడు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories