తెరపైకి 'ఘట్టమనేని' కుటుంబ చిత్రం!

తెరపైకి ఘట్టమనేని కుటుంబ చిత్రం!
x
Highlights

తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు తరాల కధానాయకులను ఇప్పటి వరకు మనం చాలానే మందిని చూసాం .. కానీ మూడు తరాల కధానాయకులను చూడడం అనేది చాలా అరుదు .. ఇప్పుడు తెర పైకి ఘట్టమనేని కుటుంబ చిత్రాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి .

సూపర్ స్టార్ కృష్ణ, ఆయన తనయుడు మహేష్ బాబు కలిసి అన్న తమ్ముడు , కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు , వంశీ , రాజకుమారుడు వంటి సినిమాల్లో నటించారు . ఇక మహేష్ తన తనయుడు గౌతం కృష్ణతో కలిసి వన్ నేనొక్కడినే అనే సినిమాలో కలిసి నటించారు. కానీ ఈ మూడు తరాల కధానాయకులు మాత్రం కలిసి ఇంతవరకు స్క్రీన్ పైన కనిపించింది లేదు ... అయితే ఇప్పుడు ఈ ఘట్టమనేని కుటుంబాన్ని తెరపైన ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట .. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో సరైన స్క్రిప్ట్ కోసం కసరత్తులు చేస్తున్నారట. దాదాపుగా స్క్రిప్ట్ కూడా ఓ కొలిక్కి వచ్చిందని టాలీవుడ్ టాక్. స్క్రిప్ట్ ఫైనల్ అయిన తరువాత ఈ విషయం పై అఫిషల్ అనౌన్స్ మెంట్ విడుదలయ్యే అవకాశం ఉంది ..

బాలీవుడ్‌లో రాజ్‌క‌పూర్ కుటుంబం.. టాలీవుడ్ లో అక్కినేని కుటుంబం మూడు తరాల నటులు ఇప్పటివరకూ మన దేశ సినిమా చరిత్రలో కలిసి నటించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కనుక ఘట్టమనేని కుటుంబ నటులు ముగ్గురు కలిసి నటిస్తే అది సంచలనమే అవుతుంది. అప్పట్లో సూపర్ స్టార్ గా కృష్ణకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ అలానే ఉంది. ఇక మహేష్ బాబు ప్రిన్స్ గా తెలుగు తెరపై ప్రేక్షకులని ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తున్నారు. వీరి తరువాతి తరం నుంచి ఇప్పటికే గౌతమ్ కూడా ఒక్క సినిమాతోనే వారసుడు అని అనిపించుకున్నాడు. అందుకే ఈ వార్త నిజమవ్వాలని ఘట్టమనేని కుటుంబ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. వంశీ ఈ మాయను చేస్తాడని ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories