200 కోట్ల క్లబ్ లో మహేష్ 'సరిలేరు నీకెవ్వరు'

200 కోట్ల క్లబ్ లో మహేష్ సరిలేరు నీకెవ్వరు
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11 న...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి ఘన విజయాన్ని దక్కించుకుంది. సినిమాకి మంచి టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది ఈ సినిమా.. కేవలం పది రోజుల్లో రూ.200కోట్ల గ్రాస్ వ‌సూళ్లను సాధించినట్టుగా చిత్ర నిర్మాణ సంస్థలో ఒకటైనా ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా పది రోజుల్లో కేవలం తెలుగు రాష్ట్రాల్లో రూ.101.87 కోట్లు (షేర్‌) రాబట్టినట్లు చెప్పారు.

నైజాంలో రూ.88 కోట్లు

సీడెడ్‌లో రూ.14.65 కోట్లు

ఉత్తరాంధ్రాలో రూ.17.07 కోట్లు

గుంటూరులో రూ.98.08 కోట్లు

తూర్పు గోదావరిలో రూ.10.06 కోట్లు

పశ్చిమ గోదావరిలో రూ.6.57 కోట్లు

కృష్ణలో రూ.7.9 కోట్లు ,

నెల్లూరులో రూ.8.62 కోట్లు సాధించినట్లు అంచనా వేశారు.

ఈ సినిమాలో మహేష్ మొట్టమొదటిసారిగా ఆర్మీ లుక్ లో కనిపించారు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రాజేంద్రప్రసాద్, సంగీత, రావు రమేష్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మించారు.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాని చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాల్లో హీరోయిన్ గా కీయరా అద్వానీ నటిస్తుందని సమాచారం. పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేయనున్నాడు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories