Mahesh Babu: మరోసారి సంక్రాంతినే టార్గెట్ చేసిన మహేష్

Mahesh Babu: మరోసారి సంక్రాంతినే టార్గెట్ చేసిన మహేష్
x
Highlights

సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్ ని అందుకున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్ ని అందుకున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ని సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లును రాబడుతుంది. మొదటిసారిగా మహేష్ ఈ సినిమాలో ఆర్మీ రోల్ లో కనిపించారు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ భారతీగా లేడీ అమితాబ్‌ విజయశాంతి పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు. ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.

మొత్తం సంక్రాంతికి ఇప్పటివరకు మహేష్ ఆరు సినిమాలని రిలీజ్ చేశాడు. అందులో టక్కరి గొంగ, వన్ నేనొక్కడినే సినిమాలు నిరాశని మిగిల్చగా ఒక్కడు, బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. సంక్రాంతి సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడంతో మహేష్ తన తదుపరి చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాని చేస్తున్నాడు. ఇది మహేష్ కి 27 వ చిత్రం. సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాల్లో హీరోయిన్ గా కీయరా అద్వానీ నటిస్తుందని సమాచారం. పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నాడని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేయనున్నాడు మహేష్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories