Mahesh Babu: మళ్ళీ సమ్మర్ వరకు మహేష్ నుంచి నో సినిమా!

Mahesh Babu: మళ్ళీ సమ్మర్ వరకు మహేష్ నుంచి నో సినిమా!
x
Highlights

సరిలేరు నీకెవ్వరు సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహేష్ నుంచి మంచి హిట్ మూవీ రావడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక మహేష్ తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో మహర్షి అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ నుంచి సినిమా వస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాని వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తునట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకువెళ్తున్నారు. సమ్మర్ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకేక్కుతుంది. ఈ సినిమాని దిల్ రాజు_ పివిపి కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో మహేష్ సరసన కీయరా అద్వానీని ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. గతంలో వీరు భరత్ అను నేను సినిమాలో కలిసి నటించారు.

ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా విషయానికి వస్తే మహేష్ బాబు ఇందులో మొట్టమొదటిసారిగా ఆర్మీ లుక్ లో కనిపించారు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ భారతీగా లేడీ అమితాబ్‌ విజయశాంతి పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మించారు. ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమా విజయం సాధించడంతో దర్శకుడు అనిల్ తో మరో సినిమాని చేయడానికి ఫిక్స్ అయ్యాడు మహేష్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories