అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఘట్టమనేని కుటుంబ చిత్రం

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఘట్టమనేని కుటుంబ చిత్రం
x
Highlights

సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు హీరో మహేష్ బాబు .. మహేష్ బాబు కెరియర్ తొలినాళ్ళలో కృష్ణ గెస్ట్ రోల్ చేసుకుంటూ వచ్చారు.

సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు హీరో మహేష్ బాబు .. మహేష్ బాబు కెరియర్ తొలినాళ్ళలో కృష్ణ గెస్ట్ రోల్ చేసుకుంటూ వచ్చారు. రాజకుమారుడు, వంశీ చిత్రాలలో నటించి మంచి సపోర్ట్ ని ఇచ్చారు. ఆ తరవాత వీరిద్దరూ కలిసి నటించింది లేదు. అయితే తాజాగా మళ్ళీ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కృష్ణ కనిపించారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలోని కొన్ని సన్నివేశాలను వాడుకున్నారు. ధియేటర్లో ఈ సన్నివేశాలకి మంచి స్పందన వచ్చింది. దీనితో మళ్ళీ మహేష్ -కృష్ణ నటించాలని అన్న డిమాండ్స్ వచ్చాయి. ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో మహేష్ బాబు స్పందించాడు.

" సరిలేరు నీకవ్వరు సినిమా చూసిన తర్వాత నాన్నగారు అనిల్ ని కలవాలని అన్నారు. ఇంతవరకు నాన్న ఎప్పుడూ ఒకరిని కలవాలని అడగలేదు. నాన్న నేను కలిసి నటించాలని అనుకుంటున్నాం అది అనిల్ వల్లే సాధ్యమని అనుకుంటున్నానని" చెప్పుకొచ్చాడు మహేష్ ఇక అనిల్ రావిపూడి తో కూడా మహేష్ మరో సినిమాని చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు.

మొత్తానికి కృష్ణ - మహేష్ బాబుని ఒకే స్క్రీన్ పైన త్వరలో చూడబోతున్నామని ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఇదే సినిమాలో మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణని కూడా నటింపజేస్తే అక్కినేని తర్వాత ఫ్యామిలీ హీరోస్ కలిసి నటించిన చిత్రంగా టాలీవుడ్ లో ఘట్టమనేని కుటుంబం చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో ..

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాని చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాల్లో హీరోయిన్ గా కీయరా అద్వానీ నటిస్తుందని సమాచారం. పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories