Mahesh Babu: కొత్త బిజినెస్ లోకి మహేష్ ..

Mahesh Babu: కొత్త బిజినెస్ లోకి మహేష్ ..
x
Mahesh babu
Highlights

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మహేష్ .. తాజాగా సరిలేరు...

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మహేష్ .. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టారు. ఒకపక్క సినిమాలు చేసుకుంటూనే మరో పక్కా వ్యాపారాల‌ను చూసుకుంటారు మహేష్.. ఇప్పటికే 22 బ్రాండ్లకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అంతేకాకుండా జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో ప‌లు చిత్రాలను కూడా నిర్మిస్తున్నారు. అయితే వీటికి తోడు మహేష్ ఇప్పుడు మరో బిజినెస్ ని మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ప‌ర్‌ఫ్యూమ్ బిజినెస్ విష‌యంపై మ‌హేష్ కొద్ది రోజులుగా చ‌ర్చలు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది.

కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్!

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. మహేష్ బాబు మొదటిసారి ఆర్మీ లుక్ లో కనిపించడం, 13 ఏళ్ల తరవాత లేడి అమితాబ్ రీఎంట్రీ ఇవ్వడంతో సినిమాపైన అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడంతో సినిమాకి మొదటిరోజు నుంచే మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక సినిమాకి ముందు దేవీ అందించిన పాటలకి ఎక్కడలేని రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.

వంశీ అవుట్ ?

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు ఈ సినిమాని మహేష్ పక్కన పెట్టారని వార్తలు వస్తున్నాయి. కథలో చిన్న చిన్న మార్పులు చేయాలనీ మహేష్ వంశీని కోరారని టాక్ నడుస్తోంది. అయితే తన 27 వ సినిమాని మహేష్ `గీత గోవిందం` ఫేం పరుశురాంతో చేస్తునట్టుగా వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నట్టుగా సమాచారం.. ప్రస్తుతం పరుశురాం నాగచైతన్యతో ఓ సినిమాకి కమిట్ అయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories