అల్లు అర్జున్ vs మహేష్ ...ఒకేరోజు రెండు సినిమాలు ... ఫాన్స్ కి పండగే పండగ ..

అల్లు అర్జున్ vs మహేష్ ...ఒకేరోజు రెండు సినిమాలు ... ఫాన్స్ కి పండగే పండగ ..
x
Highlights

ఒకే రోజు సంక్రాంతి బరిలోకి దిగి నువ్వా నేనా అనబోతున్నారు అల్లు అర్జున్ , మహేష్ బాబు.. ప్రస్తుతం వీరిద్దరూ చేస్తున్న సినిమాలు ఒకే రోజున దియేటర్లోకి...

ఒకే రోజు సంక్రాంతి బరిలోకి దిగి నువ్వా నేనా అనబోతున్నారు అల్లు అర్జున్ , మహేష్ బాబు.. ప్రస్తుతం వీరిద్దరూ చేస్తున్న సినిమాలు ఒకే రోజున దియేటర్లోకి రానున్నాయి. 12.01.2020 న సినిమాలను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్స్ అధికారకంగా ప్రకటించాయి. ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా రష్మిక నటిస్తుంది. అలనాటి తార విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి..

ఇక జులాయి,సన్ అఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రమ్ ,అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడవ చిత్రంగా అల వైకుంటపురములో అనే సినిమా వస్తుంది. పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన సామజవరగమనా పాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.పూర్తి స్థాయి కుటుంబ కథ చిత్రంగా ఈ సినిమా ఉండబోతుంది. హారిక హాసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

ఒకే రోజు ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవ్వడంతో ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సంక్రాంతి బరిలో మా హీరో హిట్టు కొట్టడం ఖాయమని ఎవరి ఫాన్స్ వారే చెప్పుకుంటున్నారు. మరి సంక్రాంతి బరిలో ఎవరు విజేత అవుతారో...








Show Full Article
Print Article
More On
Next Story
More Stories