హీరో ధనుష్ కి హైకోర్ట్ షాక్!

హీరో ధనుష్ కి హైకోర్ట్ షాక్!
x
Highlights

ప్రముఖ నటుడు ధనుష్ కి మద్రాస్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. గత కొద్దిరోజుల కింద ధనుష్ తమ కుమారుడని మదురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ప్రముఖ నటుడు ధనుష్ కి మద్రాస్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. గత కొద్దిరోజుల కింద ధనుష్ తమ కుమారుడని మదురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో ధనుష్ బర్త్ , స్టడీ, ఇంటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించాలని కోర్టు ప్రశ్నించింది. అయితే ధనుష్ వాటిని సమర్పించకపోవడంతో ధనుష్ తరుపు న్యాయవాదిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో సదరు న్యాయవాది మరో 15 రోజుల సమయం కోరగా వాటిని 15 రోజులలో సమర్పించాలని ఆదేశించింది కోర్టు.

ఇక ధనుష్ ని చిన్నప్పుడు కోపడితే ఇంటినుంచి బయటకు వెళ్ళాడని కదిరేషన్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ తాము ఎవరో తెలియదంటూ చెప్పడం బాధగా ఉందని వాపోతున్నారు. ఇక డీఎన్‌ఏ చేయిస్తే అసలు నిజం బయటకు వస్తుందని వారు కోర్టుకు తెలిపారు. అయితే ధర్మాసనం తెలిపిన సమయనికీ ధనుష్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ జతపర్చకపోవడంతో అందరికి అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. దీనితో ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక హీరో ధనుష్ విభిన్నమైన చిత్రాలలో నటించి నటుడుగా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను నవంబరు 18, 2004లో ధనుష్ వివాహమాడాడు. ప్రస్తుతం ధనుష్ ' జగమే తంత్రం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి 'పేట' ఫేం కార్తిక్‌ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ధనుష్‌కు 40వ చిత్రం కావడం విశేషం..ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చారు. ఐశ్వర్యలక్ష్మీ హీరోయిన్ గా నటిస్తోంది. సమ్మర్ స్పెషల్‌గా 2020 మే 1న తమిళ్, తెలుగు భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories