దేవిశ్రీ ఇంటి నుంచి లిటిల్ రాక్ స్టార్

దేవిశ్రీ ఇంటి నుంచి లిటిల్ రాక్ స్టార్
x
DSP( File Photo)
Highlights

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. దేవి సినిమాతో

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. దేవి సినిమాతో కెరియర్ ని ప్రారంభించిన దేవి మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆనందం, ఆర్య, మన్మధుడు, శంకర్ దాదా ఎంబీబీయస్ లాంటి సినిమాలను చేసి టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరును సంపాదించుకున్నాడు. మొత్తం తన కెరియర్ లో తొమ్మిది ఫిలింఫేర్‌ అవార్డులను సొంతం చేసుకున్నాడు. తాజాగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు అనే సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలకి శ్రోతలనుంచి మంచి స్పందన వస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఇంటి నుంచి మరో రాక్‌స్టార్‌ వచ్చేశాడు. ఆటను ఎవరో కాదు.. దేవిశ్రీ ప్రసాద్‌ మేనల్లుడు తనవ్‌ సత్య... మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలోని పాటను పాడుతూ.. పక్కనే ఉన్న టేబుల్ ని కొడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని దేవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడిస్తూ.. సరిలేరు నీకెవ్వరు నుంచి ఆంథమ్‌ను సాంగ్ ని పెద్ద హిట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా మేనల్లుడు తనవ్‌ సత్య ఈ పాటను తనకు తానుగా నేర్చుకుని నన్ను సర్‌ప్రైజ్‌ చేశాడని" పేర్కొన్నాడు.

అయితే ఈ వీడియోపైన దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పందిస్తూ.. 'లిటిల్‌ రాక్‌స్టార్.. సూపర్‌‌ అని పేర్కొన్నారు. ఇక ఈ వీడియోపైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇక సరిలేరు నీకెవ్వరు విషయానికి వచ్చేసరికి సంక్రాంతికివిడుదలవుతున్న ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో మహేష్ ఆర్మీ అజయ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇందులో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుంది. సంగీత, విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాని దిల్ రాజు అనిల్ సుంకరలతో కలిసి మహేష్ నిర్మిస్తున్నాడు. సంక్రాంతి పండగ సందర్బంగా సినిమాని జనవరి 11 న రిలీజ్ చేయనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories