రమ్యకృష్ణను నమ్ముకున్న కృష్ణవంశీ... కొత్త సినిమా అనౌన్స్..

రమ్యకృష్ణను నమ్ముకున్న కృష్ణవంశీ... కొత్త సినిమా అనౌన్స్..
x
Highlights

తెలుగులో చాలా మంది దర్శకులు ఉన్నారు.. కానీ క్రియేటివ్ థాట్స్ తో సినిమాలు చేసే దర్శకులలో కొందరే ఉన్నారు. అందులో కృష్ణవంశీ ఒకరు.. నిన్నే పెళ్లాడుతా,...

తెలుగులో చాలా మంది దర్శకులు ఉన్నారు.. కానీ క్రియేటివ్ థాట్స్ తో సినిమాలు చేసే దర్శకులలో కొందరే ఉన్నారు. అందులో కృష్ణవంశీ ఒకరు.. నిన్నే పెళ్లాడుతా, ఖడ్గం, మురారి, చందమామ, మహాత్మ లాంటి సినిమాలు తీసి తనకి తాను ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు కృష్ణవంశీ.. ఆ తర్వాత చాలా సినిమాలు ఆయనకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి.. ఇక 2017లో వచ్చిన న‌క్ష‌త్రం సినిమా తర్వాత ఆయన మరో సినిమాని అనౌన్స్ చేయలేదు.. అంటే దాదాపుగా కృష్ణవంశీ సినిమా లేకా రెండు సంవత్సరాలు అయ్యింది.తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు కృష్ణవంశీ.. తన కొత్త సినిమాకి 'రంగమార్తాండ' అని టైటిల్ ను పెట్టారు. సినిమాకి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేశారు. మరాఠీలో వచ్చిన నటసామ్రాట్ సినిమాకి రీమేక్ అన్నమాట..

మరాఠీలో నానా పటేకర్ మెయిన్ లీడ్ లో నటించారు.. ఇక్కడ ప్రకాష్ రాజ్ చేయనున్నారు. ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తుంది.. రమ్యకృష్ణ , కృష్ణ వంశీ కలిసి 1998లో చంద్ర‌లేఖ అనే సినిమాలో మొదటిసారిగా నటించారు. ఆ తర్వాత శ్రీ ఆంజనేయం సినిమా చేసారు. మళ్లీ ఈ సినిమాకి కలిసి పనిచేస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ మాత్రమే కాకుండా అవికాగోర్ ఓ ముఖ్య పాత్ర‌లో నటిస్తుంది. సినిమాకి సంబధించిన మిగతా ఆర్టిస్టులను మరియు టెక్నికల్ విభాగాన్ని త్వరలో వెల్లడించనున్నారు. మరి గత కొంతకాలంగా ఫ్లాప్ లో ఉన్న కృష్ణవంశీని ఈ సినిమా అయిన గట్టేకిస్తుందా లేదా అన్నది చూడాలి..





Show Full Article
Print Article
More On
Next Story
More Stories