జనతా గ్యారేజ్ సినిమాలో బాలయ్యని అందుకే తీసుకోలేదట!

జనతా గ్యారేజ్ సినిమాలో బాలయ్యని అందుకే తీసుకోలేదట!
x
Highlights

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జనతా గ్యారేజ్ .. సమంత, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటించారు

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జనతా గ్యారేజ్ .. సమంత, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటించారు. 2016లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రకృతి ప్రేమికుడిగా, సహాయం కోసం జనతా గ్యారేజ్ కి వచ్చే వారి భాదలు తీర్చే వ్యక్తిగా ఎన్టీఆర్ అదరగొట్టారు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మెకానిక్ సత్యం అనే ముఖ్యపాత్రలో పోషించారు.

అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రను ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే బాలకృష్ణని ఆ పాత్ర కోసం ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకి కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. " బాలకృష్ణ, ఎన్టీఆర్ గొప్ప కాంబినేషన్.. వీరిద్దరూ సినిమా చేస్తున్నారంటే ఆ అంచనాలు వేరే ఉంటాయి. ప్రేక్షకుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ ని చూసేందుకు మాత్రమే సినిమాకి వస్తాడు. కథని పట్టించుకోడు. ఇది కథ బలం ఉన్న సినిమా.. దానికి ఇది సరైనా సమయం కాదు. అందుకే బాలకృష్ణని తీసుకోలేదని" చెప్పుకొచ్చారు కొరటాల

ప్రస్తుతం కొరటాల చిరంజీవితో ఓ సినిమాని చేస్తున్నారు. ఇప్పటికే ముహూర్తపు సన్నివేశాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా కోకాపేటలోని చిరంజీవి స్థలంలో వేసిన సెట్ లో తొలి షెడ్యుల్ ని మొదలుపెట్టారు. ఇందులో చిరంజీవి దేవాదాయశాఖలో పనిచేసే అధికారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ , కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories