సొంతూరిలో వ్యవసాయం చేస్తున్న హీరోయిన్...

సొంతూరిలో వ్యవసాయం చేస్తున్న హీరోయిన్...
x
Keerthi Pandian (File Photo)
Highlights

లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఇక సినిమా స్టార్స్ కూడా తమ షూటింగ్ లను పక్కన పెట్టేసారు..

లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఇక సినిమా స్టార్స్ కూడా తమ షూటింగ్ లను పక్కన పెట్టేసారు.. కొందరు ఇంట్లో ఉంటూ వంటలు చేస్తూ కనిపిస్తున్నారు. అంతేకాకుండా తమకి ఇష్టమైన పనులను చేస్తూ అభిమానుల చేత శభాష్ అనిపిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్ కీర్తీ పాండియ‌న్ తన సొంత ఉళ్ళో వ్యవసాయం చేస్తూ రైతుగా మారారు.

ప్రముఖ న‌టుడు అరుణ్ పాండియ‌న్ కుమార్తె అయిన కీర్తీ పాండియ‌న్ తుంబ అనే చిత్రం ద్వారా ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. ప్రస్తుతం విలన్‌ అనే మలయాళ చిత్ర తమిళ రీమేక్‌ లో నటిస్తుంది. ఇందులో అయన తండ్రి కూడా నటిస్తుండడం విశేషం.. ఇక ఇది ఇలా ఉంటే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లకి బ్రేక్ రావడంతో కీర్తీ పాండియ‌న్ తన సొంత గ్రామానికి వెళ్ళింది.

అక్కడ ట్రాక్టర్‌ ఎక్కి పొలాన్ని దున్నుతున్న వీడియోను, నాట్లు వేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా ఎకౌంటులో షేర్ చేస్తూ లాక్ డౌన్ సమయం ఈ విధంగా ఉపయోగపడుతుందని, ఇదంతా మాదే పొలం అంటూ చెప్పుకొచ్చింది. కీర్తీ పాండియ‌న్ చేస్తున్న ఈ పనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇతరులకి స్ఫూర్తినిచ్చేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories