రోజుకో హీరోయిన్ తో మన్మధుడు 2 కి పిచ్చ క్రేజ్...

రోజుకో హీరోయిన్ తో మన్మధుడు 2 కి పిచ్చ క్రేజ్...
x
Highlights

"అందమైన భామలు లేత మెరుపు తీగలు" అనే పాటకి మన్మధుడు మొదటి పార్ట్ లో చిన్నచిన్న స్టెప్స్ వేసి అలరించిన నాగార్జున ఇప్పుడు అ పాటకి అర్ధం వెతికే పనిలో...

"అందమైన భామలు లేత మెరుపు తీగలు" అనే పాటకి మన్మధుడు మొదటి పార్ట్ లో చిన్నచిన్న స్టెప్స్ వేసి అలరించిన నాగార్జున ఇప్పుడు అ పాటకి అర్ధం వెతికే పనిలో ఉన్నట్టు కనిపిస్తుంది.. మన్మధుడు సినిమాకి సీక్వెల్ మొదలు పెట్టిన్నప్పటి నుండి సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే హీరోయిన్ అనుకున్నారు. కానీ సినిమా షూటింగ్ జరగుతున్న కొద్దీ సినిమాలో హీరోయిన్ ల పాత్రలు అమాంతం పెరుగుతుంది ..

తర్వాత ఓ చిన్న గెస్ట్ రోల్ కోసం బెంగళూరు బ్యూటీ అక్షర గౌడను తీసుకున్నారు. ఇక మరో కీలకపాత్ర కోసం అక్కినేని కోడలు సమంతను తీసుకున్నారు. తాజాగా వీళ్లు చాలరన్నట్టుగా ఈ ప్రాజెక్టులోకి మరో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చింది .. మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేష్ ఇప్పుడు మన్మధుడు 2 లో గెస్ట్ రోల్ లో కనిపించనుంది .

కీర్తిసురేష్ ఇప్పటి వరకు ఆమె గెస్ట్ రోల్ చేసింది లేదు.. సినిమాలోని పాత్ర ఆమె చుట్టూ తిరుగుతూ చేసిన పాత్రకి మంచి గుర్తింపు వస్తుందంటే సినిమాకి ఒకే చెబుతుంది కీర్తిసురేష్ . ఇంతకు ముందు కూడా ఆమె చేసిన సినిమాలు కూడా ఇంచుమించుగా అలాగే ఉంటాయి .. రాహుల్ రవీంద్రన్ కోరిక మేరకు ఇందులో ఓ చిన్న పాత్రలో మెరిసేందుకు ఒప్పుకుందట. అంతేకాకుండా కింగ్ నాగర్జునతో సినిమా కావడం మరో విశేషం ..

ప్రాజెక్ట్ లో ఇంతా మంది అమ్మాయలు ఎందుకన్నా సందేహం వస్తుంది కదా ! తాజా సమాచారం ప్రకారం రకుల్ ప్రీత్ ఇందులో మెయిన్ లీడ్ కాగా మిగతా హీరోయిన్స్ అందరు ఫ్లాష్ బ్యాక్ లో వస్తారట .. అందులో భాగాగానే హీరో పాత్ర రొమాంటిక్ మాత్రమే కాకుండా మంచివాడు అని ఎలివేట్ చేసేందుకు ఈ పాత్రలు సినిమాలో చాలా ఉపయోగపడతాయట...

Show Full Article
Print Article
Next Story
More Stories