Indian 2 accident: కోటి రూపాయలు ప్రకటించిన కమల్

Indian 2 accident: కోటి రూపాయలు ప్రకటించిన కమల్
x
Highlights

ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'ఇండియన్ 2'.. అయితే ఈ సినిమా సెట్లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'ఇండియన్ 2'.. అయితే ఈ సినిమా సెట్లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. ఈవీపీ ఫిల్మ్ సిటీలో బుధవారం రాత్రి షూటింగ్ స్పాట్‌లో క్రేన్ కింద పడటంతో ముగ్గురు వ్యక్తులు (మధు(29), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ(34), చంద్రన్‌ ) మృతిచెందగా, మరో పది మందికి గాయాలు అయ్యాయి. అయితే మృతిచెందిన వారి కుటుంబాలకు కమల్‌ హాసన్‌ కోటి రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కమల్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. " నా స్వంతంగా నేను మరణించినవారికి రూ. 1 కోట్లు విరాళంగా ఇస్తున్నాను.. నేను ఇప్పుడు చేయగలిగేది ఇదే. " మూడు సంవత్సరాల క్రితం, నేను కూడా ఒక ప్రమాదంలో ఉన్నాను. ఇలాంటి ప్రమాదం నుండి కోలుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసనని, కోట్ల బడ్జెట్‌తో సినిమాని చేస్తున్నాం అని గర్వంగా చెప్పుకుంటాం కానీ, సినిమా కోసం పనిచేసే వాళ్లకి సరైన రక్షణ ఇవ్వలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకుంటామని కమల్ చెప్పుకొచ్చాడు.

ఇక ఇదే అంశంపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా స్పందించింది. ఈవీపీ ఫిల్మ్ సిటీలో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. నటుడు విజయ్ బిగిల్ షూట్ సమయంలో, ఒక క్రేన్ పైన ఫోకస్ లైట్ అతనిపై పడటంతో ఒక వృద్ధ ఎలక్ట్రీషియన్ తీవ్రంగా గాయపడ్డాడు.

శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా 1996 లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం భారతీయుడుకు ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది. సంవత్సరం క్రితం సినిమా ప్రారంభం అయింది. కానీ షూటింగ్ మాత్రం సీరియస్ గా జరగడం లేదు. అయితే ఈ నెలలో ఈ సినిమా కోసం భారీ సెట్స్ ఏర్పాటు చేశారు. షూటింగ్ వేగం పుంజుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చిత్ర బృందానికి షాక్ కలిగించింది. కాగా ఈ సినిమా కోసం కమల్ ఎక్కువ కాల్ షీట్స్ ఇచ్చారు. సినిమాని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories