సమంత -శర్వానంద్ : 'జాను' టీజర్ వచ్చేసింది

సమంత -శర్వానంద్ : జాను టీజర్ వచ్చేసింది
x
Jaanu
Highlights

తమిళ్ లో మంచి హిట్టు అయిన 96 సినిమాని తెలుగులో 'జాను' అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత, శర్వానంద్

తమిళ్ లో మంచి హిట్టు అయిన 96 సినిమాని తెలుగులో 'జాను' అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది. దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. తాజాగా సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం..

చిత్ర టీజర్ లో జానకిగా సమంత, రామ్ గా శర్వానంద్ నటించారు..నటనలో ఇద్దరు కూడా పోటిపడి నటించారు. " నన్ను వదిలేసి చాలా దూరం వేల్లిపోయావా రామ్ అని సమంత అడగగా ... నిన్ను ఎక్కడ వదిలేసానో అక్కడే ఉన్నానని శర్వానంద్ చెప్పే డైలాగ్ టీజర్ కి హైలెట్ గా నిలిచింది. ఒరిజినల్ సినిమా ఫీల్ ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా నటించారు. ఇద్దరి మద్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా సమంత కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందా అన్నట్టుగా ఉంది. త‌మిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగులో కూడా ద‌ర్శక‌త్వం వహించాడు.

తమిళ్ వర్షన్ లో త్రిష, విజయ్‌ సేతుపతి కలిసి నటించారు. ఈ సినిమా 2018 లో విడుదలైంది. అక్కడ ఈ సినిమా పెద్ద హిట్టయింది. ముఖ్యంగా ప్రేమికులకి ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. గోవింద వసంత సంగీతమందిస్తున్నా ఈ సినిమాని ఫిబ్రవరి 7 న రిలీజ్ చేస్తున్నారు.

ఇక సినిమా కథ విషయానికి వచ్చే సరికి స్కూల్ డేస్‌లో ప్రేమలో పడ్డ హీరో, హీరోయిన్లు ఇద్దరు ఆ తర్వాత కొన్ని కారణాలతో విడిపోవాల్సి వస్తుంది. ఇలా జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తారు. అప్పుడు వీరిద్దరి మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మళ్ళీ వీరు కలిశారా లేదా అన్న నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories