బ్రేకింగ్.. దిల్ రాజు ఆఫీసుపై ఐటీ దాడులు!

బ్రేకింగ్.. దిల్ రాజు ఆఫీసుపై ఐటీ దాడులు!
x
Highlights

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కార్యాలయం పై ఐటీ దాడులు బుధవారం జరిగాయి. బంజారా హిల్స్ లోని శ్రీనగర్ కాలనిలో ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు దిగారు....

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కార్యాలయం పై ఐటీ దాడులు బుధవారం జరిగాయి. బంజారా హిల్స్ లోని శ్రీనగర్ కాలనిలో ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు దిగారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఆయన నిర్మించిన మహర్షి సినిమా విడుదలకు సరిగ్గా ఒక రోజు ముందు ఈ దాడులు జరగడం సంచలనం కలిగిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 140 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయల వరకు జరిగినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఐటీ దాడులకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మహర్షి సినిమా థియేటర్ల బిజినెస్ 95 కోట్లుగాను, నాన్ థియేటర్ బిజినెస్ 45 కోట్లుగాను జరగడంతో, ఇది రికార్డుగా విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఐటీ దృష్టి దిల్ రాజు పై పడినట్టుగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రేపు ఈ సినిమా విడుదల కానుంది. ఇపుడు ఈ ఐటీ దాడులతో సినిమాకు మరింత ప్రచారం లభించినట్టవుతోంది. ఈ సినిమాకి దిల్ రాజు తో పాటు అశ్విని దత్, పీవీపీలు కూడా నిర్మాతలుగా వున్నా విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories