Breaking : హీరోయిన్ రష్మిక మందన్నా ఇంటిపై ఐటీ దాడులు

Breaking : హీరోయిన్ రష్మిక మందన్నా ఇంటిపై ఐటీ దాడులు
x
రష్మిక మందన్నా
Highlights

హీరోయిన్ రష్మిక మందన్నాకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె సొంత రాష్ట్రం కర్నాటకలోని కూర్గ్‌లో ఉన్న ఆమె నివాసంపై ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. ఆమె...

హీరోయిన్ రష్మిక మందన్నాకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె సొంత రాష్ట్రం కర్నాటకలోని కూర్గ్‌లో ఉన్న ఆమె నివాసంపై ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. ఆమె ఆదాయానికి సంబంధించి లెక్కలను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 'గీత గోవిందం' సినిమాతో రష్మికకు టాలీవుడ్‌లో తిరుగు లేకుండా పోయింది. తాజాగా ఆమె నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ టాక్‌తో ప్రదర్శింపబడుతోంది.

తెలుగుతో పాటు కన్నడ చిత్రాల్లోనూ రష్మిక మందన్నా హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. సరిగా ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సినీ సెలబ్రిటీలే లక్ష్యంగా ఐటీ శాఖ దాడులు చేపడుతోంది. అనసూయ, సుమ, లావణ్య త్రిపాఠీతో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖలపై ఐటీశాఖ వరుసగా దాడులు నిర్వహించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories