Charmy Kaur: నటనకి రిటైర్మెంట్ ప్రకటించిన ఛార్మి!

Charmy Kaur: నటనకి రిటైర్మెంట్ ప్రకటించిన ఛార్మి!
x
Charmy Kaur(File Photo)
Highlights

సినిమాల్లో నటించడంపై నటి చార్మీ కీలక ప్రకటన చేసింది. తానూ ఇక సినిమాలో నటించబోనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు

సినిమాల్లో నటించడంపై నటి చార్మీ కీలక ప్రకటన చేసింది. తానూ ఇక సినిమాలో నటించబోనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వస్తున్నారని, వారంతా టాలెంట్ ఉన్నవారేనని అంటూ చెప్పుకొచ్చింది. ఈ తరుణంలో తాను నటించాలి అనుకోవడం లేదని తెలిపింది. చార్మీ చివరగా జోతిలక్ష్మి అనే సినిమాలో నటించింది. ఆ సమయంలోనే తానూ రైటర్ గా మారాలని అనుకున్నానని కానీ చెప్పలేదని, అయితే పూరి జగన్నాథ్, కల్యాణ్ సలహాతో ఆ విషయాన్ని ప్రకటించలేదని చార్మీ చెప్పుకొచ్చింది.

ఇక చార్మీ సినీ కెరీర్ విషయానికి వచ్చేసరికి ఛార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. నీతోడు కావాలి అనే తెలుగు సినిమాలో ఆమెకి నటించే అవకాశం వచ్చింది. అప్పటికి చార్మీ వయసు కేవలం14 సంవత్సరాలు మాత్రమే. 2001లో విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత 2003లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా మళ్ళీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది.

ఆ తరవాత గౌరి, మాస్, చక్రం, అనుకోకుండా ఒక రోజు,లక్ష్మీ, రాఖీ, మంత్ర మొదలగు చిత్రాలలో నటించింది. ముఖ్యంగా మంత్ర సినిమాకి గాను ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే అమెకి సినిమాలలో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయని చెప్పాలి. ఇక టాలీవుడ్ కి కొత్తకొత్త హీరోయిన్స్ వస్తు ఉండడంతో చార్మీ మెల్లిమెల్లిగా ఫెడ్ అవుట్ అయిపొయింది.

ఈ తరుణంలో చార్మీ నిర్మాతగా మారింది. గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కలిసి పూరి జగన్నాధ్ తో కలిసి నిర్మాణ భాద్యతలు చేపట్టింది. ఈ సినిమా ఉహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి గాను చార్మీ సహా నిర్మాతగా వ్యవహరిస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories