'రీసౌండ్' చేయబోతున్న సాయి రామ్ శంకర్

రీసౌండ్ చేయబోతున్న సాయి రామ్ శంకర్
x
సాయి రామ్ శంకర్, రాశిసింగ్‌
Highlights

దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో సాయి రామ్ శంకర్.

దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో సాయి రామ్ శంకర్.. మొదటగా సైడ్ క్యారెక్టర్ లు చేసిన ఆ తర్వాత తనకున్న టాలెంట్ తో హీరోగా ఎదిగాడు 143 తో సినిమాతో హీరోగా కెరియర్ ని మొదలు పెట్టిన సాయి రామ్ శంకర్ వరుసుగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే రీసౌండ్ అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు.

సాయిరామ్‌శంకర్‌, రాశిసింగ్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ నిన్న ( ఆదివారం ) హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈ కృష్ణ చిరుమామిళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని జె.సురేష్‌రెడ్డి, రాజు, ఎన్‌.వి.ఎన్‌ రాజారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో సురేందర్‌రెడ్డి కెమెరా స్విఛాన్‌ చేశారు. పోసాని కృష్ణమురళి గౌరవ దర్శకత్వం వహించారు. ఆకాష్‌ పూరి పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇక సినిమా గురించి హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ ఇది ఒక విభిన్నమైన కథ అని, హైదరాబాద్, వైజాగ్ లో సినిమా చిత్రీకరణ జరుపుకుంటుందని, ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు..అరవింద్‌కృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్వీకర్‌ అగస్థి, కెమెరా: సాయిప్రకాష్‌.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories