మమల్ని క్షమించండి : రామ్ చరణ్

మమల్ని క్షమించండి : రామ్ చరణ్
x
Highlights

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాని రామ్ చరణ్ భారీ...

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రేపు ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ లో బిజీ బిజీగా ఉంది. తాజాగా చిత్ర యూనిట్ బెంగుళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. దీనికి ఉహించిన దానికంటే అభిమానులు అధిక సంఖ్యలోనే వచ్చారు.

అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో కేటాయించిన స్థలం సరిపోలేదు. దీనితో కొందరు బయటే ఉండిపోయారు. దీనిపై రామ్ చరణ్ తన ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. బెంగుళూర్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. కేటాయించిన స్థలం సరిపోకపోవడంతో కొంతమంది అభిమానులు బయటే ఉండాల్సి వచ్చింది. దానికి మమల్ని క్షమించండి. అంటూ రామ్ చరణ్ పోస్ట్ చేసారు. సైరా సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.అమితాబ్ బచ్చన్, విజయ సేతుపతి,కిచ్చా సుదీప్, తమన్నా, అనుష్క ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories