నాగశౌర్య, రీతువర్మ జంటగా కొత్త సినిమా ప్రారంభం

నాగశౌర్య, రీతువర్మ జంటగా కొత్త సినిమా ప్రారంభం
x
Highlights

ఇటివల 'అశ్వథ్థామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య.. ఇప్పుడు మరో కొత్త సినిమాని మొదలుపెట్టాడు.

ఇటివల 'అశ్వథ్థామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య.. ఇప్పుడు మరో కొత్త సినిమాని మొదలుపెట్టాడు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తుండగా, లక్ష్మీ సౌజన్య అనే కొత్త దర్శకురాలు చిత్ర పరిశ్రమకి పరిచయం అవుతుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిల్మ్ నగర్‌లోని సితార ఎంటర్‌టైన్మెంట్స్ కార్యాలయంలో జరిగాయి. ఇందులో నాగశౌర్య సరసన 'పెళ్లిచూపులు' ఫేమ్ రీతువర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈనెల 19 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రానికి సంబంధించి ఇతర నటీనటలు, సాంకేతిక వర్గం వివరాలు మరికొద్ది రోజులలో ప్రకటిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలిపారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాకు వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. నాగశౌర్య, రీతువర్మ జంటగా నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ తెరకెక్కుతున్న భీష్మ సినిమా విడుదలకి సిద్దంగా ఉంది. నితిన్ , రష్మిక మందన్నా హీరోహేరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఛలో ఫేం వెంకీ కుడుమల దర్శకత్వం వహించారు. లవ్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమాని ఫిబ్రవరి 21 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories