మహేష్ సినిమాపై కృష్ణ ఏమన్నారంటే ?

మహేష్ సినిమాపై కృష్ణ ఏమన్నారంటే ?
x
Highlights

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ' సరిలేరు నీకెవ్వరు' .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేశారు.

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ' సరిలేరు నీకెవ్వరు' .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేశారు. సినిమా మంచి విజయాన్ని అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఇప్పటికే చిత్ర యూనిట్ కూడా బ్లాక్ బస్టర్ కా బాప్ అని ప్రకటించింది కూడా.. అయితే ఈ చిత్రం పైన సూపర్ స్టార్ , మహేష్ బాబు తండ్రి కృష్ణ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రనిర్మాతల్లో ఒకటైనా ఏకే ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఇందులో కృష్ణ మాట్లాడుతూ.. " సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈ రోజు బ్లాక్ బస్టర్ అయింది. ప్రొడ్యూసర్, దర్శకుడు ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ కా బాప్ అని పబ్లిసిటి ఇవ్వడం చాలా బాగుంది. ఈ సినిమా మరింత విజయాన్ని అందుకుంటుందని అనుకుంటున్నాను. దర్శకుడు సినిమాని ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారు. ఇక నిర్మాతలు కూడా ఎక్కడ కూడా రాజీపడకుండా నిర్మించారు" అని కృష్ణ చెప్పుకొచ్చారు.

మొదటిసారిగా మహేష్ ఈ సినిమాలో ఆర్మీ రోల్ లో కనిపించారు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ భారతీగా లేడీ అమితాబ్‌ విజయశాంతి పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మించారు. ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాని చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాల్లో హీరోయిన్ గా కీయరా అద్వానీ నటిస్తుందని సమాచారం. పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేయనున్నాడు మహేష్.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories