గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన హీరో అర్జున్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన హీరో అర్జున్
x
హీరో అర్హున్, ఎమ్మెల్యే రోజా
Highlights

గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా తమిళనాడులో నిర్వహించిన కార్యక్రమంలో సినీ హీరో అర్జున్ తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా తమిళనాడులో నిర్వహించిన కార్యక్రమంలో సినీ హీరో అర్జున్ తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. మరో ముగ్గురిని నామినేట్ టేశారు. ఎమ్మెల్యే రోజా స్వయంగా అర్జున్ ఇంటికి వెళ్లి మొక్కలు నాటించారు. పర్యావరణ పరిరక్షణకు సంతోష్ చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్ఫూర్తిగా తీసుకొని రోజా మొక్కలు నాటించాలని నిర్ణయించారు.

భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలనే సంకల్పం గొప్పదన్నారు హీరో అర్జున్. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజావనంలో జగపతిబాబు , ప్రముఖ దర్శకుడు ఆర్కే సల్వామణి,ఉత్తమ నటి కుష్బూ పాల్గొనాలని వారికి ఛాలెంజ్ విసిరారు. రోజా మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం అని సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories