మహేష్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్..

మహేష్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్..
x
Mahesh babu
Highlights

ఈ ఏడాది ఆరంభంలో `సరిలెరు నీకెవ్వరు` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో

ఈ ఏడాది ఆరంభంలో `సరిలెరు నీకెవ్వరు` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజ్ చేశారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భరత్ అను నేను, మహర్షి లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్ల తర్వాత మహేష్ ఖాతాలో మరో బంపర్ హిట్ గా సరిలెరు నీకెవ్వరు చేరిపోయింది. ప్రస్తుతం సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ తన ఫ్యామిలీతో కలిసి యూ ఎస్ వెళ్ళాడు..

ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చెస్తానని మహేష్ ఇప్పటికే ప్రకటించాడు కూడా .. కానీ కథలో మహేష్ మార్పులు చెప్పడం, అది చేసాకే షూటింగ్ వెళ్దామని మహేష్ చెప్పడంతో ఈ కథను పక్కన పెట్టారని ప్రచారం నడిచింది. అంతేకాకుండా వంశీ పైడిపల్లి స్థానంలో తన 27 సినిమాని `గీత గోవిందం` ఫేం పరశురాంతో తెరకెక్కించాలని మహేష్ భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నట్టుగా సమాచారం..

అయితే ఇప్పుడు ఈ మూవీకి ముహూర్తం ఫిక్ష్ చెసినట్టు తెలిసింది. ఈనెల 13 లెదా 14న ముహూర్తం జరపనున్నారని, ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. దీనికి సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలొనే రానుందని సమాచారం ..ప్రస్తుతం పరశురాం నాగ చైతన్యతో ఓ సినిమాని చేసేందుకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మిస్తుండడం విశేషం..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories