ఆ సినిమాలో మోహన్ బాబు, చిరంజీవిని హీరోలుగా అనుకున్నాను కానీ.. !

chiranjeevi,mohan babu
x
chiranjeevi,mohan babu
Highlights

అయితే ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు ముందుగా దీనిని చిరంజీవి, మోహన్ బాబులతో కలిసి తీయాలని అనుకున్నారట గిరిబాబు.

సీనియర్ నటుడు గిరిబాబు అంటే తెలియని వారు ఉండరు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,హీరోగా, విలన్ గా దర్శకుడుగా, నిర్మాతగా ఇలు అన్ని కోణాలలో తన ప్రతిభను చాటుకున్నారు అయన.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి బిజీగా ఉన్న సమయంలో అయన దర్శకత్వం వైపు అడుగులు వేసారు. అందులో భాగంగా ఆయన మెరుపుదాడి అనే యాక్షన్/అడ్వెంచర్ సినిమాకి దర్శకత్వం వహించారు .ఈ సినిమాలో సుమన్, భానుచందర్ హీరోలుగా నటించారు. సినిమా మంచి విజయాన్ని సాధించి సుమన్, భానుచందర్ లకెరియర్ కి టర్నింగ్ పాయింట్ లాగా నిలిచింది.

అయితే ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు ముందుగా దీనిని చిరంజీవి, మోహన్ బాబులతో కలిసి తీయాలని అనుకున్నారట గిరిబాబు. ఇద్దరు కూడా చేసేందుకు ఒకే చెప్పారట .. కానీ సినిమాలో కొన్ని మార్పులు చేయాలనీ చెప్పారట.. కానీ అందుకు గిరిబాబు ఒప్పుకోలేదట.. ఆ సినిమాని ఆలాగే తీస్తే బాగుంటుందని అయన బలంగా నమ్మి ఎలాంటి మార్పులు చేయకుండా సినిమాని తీశారట.. అప్పటికే 1983 లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ఇద్దరు కిలాడీలు సినిమాలో నటించిన సుమన్, భాను చందర్ లను పెట్టి ఈ సినిమాను తీయాలని అనుకొని సినిమాని తీశానని గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమాకి కథే అసలైన హీరోనని, అందుకే ఆ సినిమా అంత మంచి విజయాన్ని అందుకుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు గిరిబాబు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories