గోపీచంద్, రానాలతో సినిమాలను ప్రకటించిన డైరెక్టర్ తేజ

గోపీచంద్, రానాలతో సినిమాలను ప్రకటించిన డైరెక్టర్ తేజ
x
Highlights

చిత్రం, జయం, నువ్వు నేను లాంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన దర్శకుడు తేజ మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తేజ వరుసపెట్టి రెండు...

చిత్రం, జయం, నువ్వు నేను లాంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన దర్శకుడు తేజ మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తేజ వరుసపెట్టి రెండు సినిమాలను ప్రకటించాడు. ఆ సినిమాలకి సంబంధించిన టైటిళ్లనూ, వాటి హీరోలనూ కూడా అనౌన్స్ చేసి సక్సెస్ కి ఎంత పక్కాగా రెడీగా ఉన్నాడో చెప్పేశాడు తేజ.. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోగా నటించనున్నారు.'రాక్షస రాజు రావణాసురుడు', 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేశాడు తేజ.. అయితే ఇందులో ఎవరితో తేజ ఏ సినిమా చేస్తున్నాడు అన్నది మాత్రం తెలియదు. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని తేజ వెల్లడించాడు.

సినిమా టైటిల్స్ ని చూస్తుంటే మాత్రం రానా హీరోగా 'రాక్షస రాజు రావణాసురుడు' అనే సినిమాని, గోపీచంద్ హీరోగా 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో తేజ వీరిద్దరితో సినిమాలు చేసి హిట్ కొట్టాడు. అయితే ఒక్కడ విషయం ఏంటంటే జయం సినిమాతో గోపీచంద్ ని విలన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజనే, ఇప్పుడు హీరోగా సినిమాని చేస్తున్నాడు. జయం సినిమా గోపీచంద్ కి ఎక్కడ లేని క్రేజ్ ని సంపాదించిపెట్టింది. ఇక ఇప్పుడు గోపీచంద్ తో చేయబోయే ఈ సినిమాని పక్కా కామెడీ జోనర్ లో తెరకేక్కిస్తున్నారట తేజ..

ఇక రానా హీరోగా 'నేనే రాజు నేనే మంత్రి' అనే సినిమాని తెరకెక్కించాడు తేజ.. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ నుంచి సినిమా వస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తేజకి కూడా ఈ సినిమా తర్వాత సరైనా హిట్ లేదు. గత ఏడాది చేసిన సీత ఆకట్టుకోలేకపోయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories