వీడి కూలి డబ్బులతో నేను సినిమా చూసాను : సుకుమార్

sukumar
x
sukumar
Highlights

నా కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే వాడి కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి. ఇది నిజం.. ఇప్పటికి అంతే..నాకు ఎం జరిగిన ముందు ఏడ్చేది వీడే..

చేయబోయే ప్రతి సినిమాలో కొత్తదనం చూపించాలని అనుకునే దర్శకులలో సుకుమార్ ఒకరు..అయన చేసిన ఆర్య ,ఆర్య 2, 100 పర్సెంట్ లవ్ , రంగస్థలం సినిమాలు మంచి విజయాన్ని అందుకొని సుకుమార్ ని స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా నిలబెట్టాయి. అయితే తన విజయం వెనుక ఆసలైన స్నేహితుడు ఇతనే అంటూ తన స్నేహితుడు కిట్టయ్యను పరిచయం చేస్తూ సుకుమార్ భాగోద్వేగానికి లోనయ్యారు.

తాజాగా రాజావారు రాణిగారు సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సుకుమార్ తన స్నేహితుడు కిట్టయ్య గురించి మాట్లాడుతూ "నా బెస్ట్ ఫ్రెండ్ వీడే.. కొన్ని సార్లు ఎవరైనా కనిపిస్తే భుజం మీదా చేయి వేసి నా ఫ్రెండ్ అని చెపుతాము కదా.. అలా కాదు. నిజమైన స్నేహితుడు.నా కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే వాడి కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి. ఇది నిజం.. ఇప్పటికి అంతే..నాకు ఎం జరిగిన ముందు ఏడ్చేది వీడే.. నాకు సినిమా అంటే ఇష్టమని, వీడు కూలి పని చేసి నన్ను సాయింత్రం సినిమాకి తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నా ఫ్రెండ్ కి ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు సుకుమార్..

ఇక రాజావారు రాణిగారు సినిమా విషయాని వస్తే పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్ గ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ట్రైలర్ యుట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలిచింది.

సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సినిమాని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories