అప్పుడు మారుతి సినిమా చూసి నవ్వారు.. ఇప్పుడు ప్రపంచం అంతా అదే దారిలో..

అప్పుడు మారుతి సినిమా చూసి నవ్వారు.. ఇప్పుడు ప్రపంచం అంతా అదే దారిలో..
x
mahanubhavudu Movie (File Photo)
Highlights

అవును మూడేళ్ల క్రితం దర్శకుడు మారుతి చెప్పింది ఇది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆచరిస్తుంది..

అవును మూడేళ్ల క్రితం దర్శకుడు మారుతి చెప్పింది ఇది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆచరిస్తుంది.. అదేంటి అనేకదా మీ అనుమానం.. అదేనండి! శర్వానంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'మహానుభావుడు' చిత్రంలో దర్శకుడు మారుతి హీరో శర్వానంద్ అతి శుభ్రత పాటిస్తున్న పాత్రలో చూపించాడు. ఓసిడి అంటూ శర్వానంద్ చేసి అతి శుభ్రత పక్కన ఉన్నవారికి విసుగు పుట్టిస్తుంది. అయితే ఇప్పుడు అదే యావత్ ప్రపంచాన్ని పాటించేలా చేస్తుంది.

అయితే అందులో కొన్ని సన్నివేశాలను నేటి కరోనా వైరస్ కి లింక్ చేస్తూ కామెడీ వీడియోలుగా మారుస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు. దీనితో ఈ సినిమాకి ఎక్కడలేని పాపులారిటి వస్తుంది. ఆ సినిమాలోని సన్నివేశాలకి విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి. అయితే దీనిపైన దర్శకుడు మారుతి స్పందిస్తూ... సినిమా రిలీజ్ అయిన సమయంలో మరీ ఇంత శుభ్రంగా ఉంటారా అని ప్రతి ఒక్కరు నవ్వుకున్నారు. కానీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వచ్చి అందరు అదే పాటిస్తున్నారు. ఇలాంటిది వస్తుందని నాకు ముందే తెలిస్తే సినిమాని ఇంకా బాగా తీసే వాడిని అని మారుతి పేర్కొన్నాడు.

ఇక గతేడాది మారుతి తెరకెక్కించిన ప్రతి రోజు పండగే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించారు.. ప్రస్తుతం ఓ యువ కథానాయకుడితో సినిమాను చేసే ఆలోచనలో దర్శకుడు మారుతి ఉన్నారు..

ఇక కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తుంది.. ఇప్పటికే 180 కి పైగా దేశాలకు విస్తరించగా, 11 వేలకు పైగా ప్రజలు మరణించారు.. ఇక భారత్లో 270 కి పైగా కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories