బన్ని పార్టీకి ఆ డైరెక్టర్ మిస్.. బన్ని పిలవలేదా? పిలిచిన రాలేదా?

బన్ని పార్టీకి ఆ డైరెక్టర్ మిస్.. బన్ని పిలవలేదా? పిలిచిన రాలేదా?
x
అల.. వైకుంఠపురములో పార్టీ
Highlights

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ...

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని త్రివిక్రమ్,బన్ని కాంబినేషన్ లో హ్యట్రిక్ మూవీగా నిలిచింది. సంక్రాంతికి రిలీజై 155 కోట్ల షేర్ బద్దలు కొట్టి అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా నైజాం, ఓవర్సీస్, కర్ణాటకలో తప్ప మిగిలిన అన్ని చోట్లలో ఇప్పటికే బాహుబలి ఫస్ట్ పార్ట్ కలెక్షన్లును దాటేసింది.

సినిమా మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ టాలీవుడ్ దర్శకులకి అదిరిపోయే పార్టీ ఇచ్చారు. బన్నీ టాలీవుడ్ డైరెక్టర్లకు ఇచ్చిన పార్టీ సంబంధించిన ఫోటో తన ట్విటర్‌లో షేర్ చేశారు. బన్నీ ఈ పార్టీలో టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌, నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు దర్శకులు కొరటాల శివ, సురేందర్ రెడ్డి, విక్రమ్ కె కుమార్, శ్రీను వైట్ల, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, కరుణాకరన్, కళ్యాణ్ కృష్ణ కురసాల, మారుతి చాలా మంది పాల్గొన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ముగ్గురు దర్శకులు మిస్ అయ్యారు. వారిలో ప్రధమంగా సుకుమార్, పూరి జగన్నాధ్ మిస్ అయ్యారు.



ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో ఓ సినిమాని చేస్తున్నాడు. ఇది బన్నికి 20వ సినిమా.. బన్ని లేకుండానే సినిమాని షూరు చేసిన సుకుమార్ సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకేక్కిస్తున్నాడు. సో సినిమా బిజీలో రాలకపోయాడు. ఇక పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతుంది. దీనితో వీరు రాకపోయిన ఎవరు పట్టించుకోలేదు, ఇక ఈ పార్టీకి మరో యువ దర్శకుడు మిస్ అయ్యాడు. దీనితో అతను ఎందుకు రాలేదు అన్న టాలీవుడ్ సర్కిల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అతనే అనిల్ రావిపూడి..

బన్ని సినిమాకి పోటిగా మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అనిల్ రావిపూడినే దర్శకుడు.. దీనితో బన్నీ ఇచ్చిన పార్టీకి అనిల్ రావిపూడి ఎందుకు రాలేదు? అనిల్ కావాలనే రాలేదా? లేకా బన్నీ ఆయన్ని పిలవలేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంక్రాంతికి రిలీజైన బన్ని, మహేష్ సినిమాలు వీపరితంగా పోటిపడ్డాయి. సినిమా రిలీజ్ డేట్స్ నుంచి కలెక్షన్ల వరకు రెండు సినిమాల మధ్య, ఫ్యాన్స్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అనిల్ ఈ పార్టీకి రాకపోవడం పెద్ద చర్చకి దారి తీసినట్టు అయింది. మరి దీనిపైన అనిల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories