ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత
x
Highlights

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. పశ్చిమ...

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. సినిమా తో దర్శకుడిగా పరిచయమయ్యారు. టాలీవుడ్ లోని అగ్రనటులందరితోనూ ఆయన సినిమాలు తీశారు. తెలుగులోనే కాక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకూ దర్శకత్వం వహించాడు. అప్పట్లో దాసరి నారాయణరావు ఒకేసారి రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. అలా దాసరి నటించిన పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తూన్న కోడి రామకృష్ణ, ఎలాగైనా దాసరిని దర్శకునిణ్ణి చేసిన రాఘవ బ్యానర్లోనే తొలిగా దర్శకుడు కావాలని ఆశించారు. అందుకు అనుగుణంగా దాసరి-రాఘవ కాంబినేషన్లో నిర్మించిన తూర్పు పడమర సినిమాలో పట్టుబట్టి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories