అదే రోజు ధియేటర్లలోకి మహేష్, బన్ని

అదే రోజు ధియేటర్లలోకి మహేష్, బన్ని
x
Mahesh babu and Allu Arjun ( File Photo)
Highlights

ఈ సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.. ఇందులో మహేష్ 'సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్

ఈ సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.. ఇందులో మహేష్ 'సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలపైన ఇప్పుడు ఎక్కువ బజ్ ఉంది. అయితే ఈ రెండు సినిమాల విడుదల తేదీలపైన కొన్ని రోజుల నుంచి సస్పెన్స్ నడుస్తుంది. ఇప్పుడు ఆ సస్పెన్స్ కి తెర పడింది. ఇద్దరు నిర్మాతల మధ్య రాజీ కుదరడంతో విడుదల తేదీలను ప్రకటించారు.

శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ .. " సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో చిత్రాల విడుదల తేదిల పైన సోషల్ మీడియాలో వీపరితమైన చర్చ నడుస్తుంది. మొదటగా ఈ రెండు సినిమాలని జనవరి 12 న రిలీజ్ చేయాలనీ అనుకున్నాం కానీ ఆ తర్వాత నిర్మాతలతో మాట్లాడి .. 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల.. వైకుంఠపురములో సినిమాలని విడుదల చేయాలనీ అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఈ రిలీజ్ డేట్‌ల విషయంలో సందిగ్ధత ఏర్పడింది. దీనితో అల.. వైకుంఠపురములో చిత్రాన్ని జనవరి 10, లేదా 11న విడుదల చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

మళ్లీ దీనిపైన కలిసి మాట్లాడుకున్నామని, దీనితో ముందుగా అనుకున్నట్టుగానే జనవరి 11 న సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల.. వైకుంఠపురములో చిత్రాలని విడుదల చేస్తున్నామని ఇందులో ఎలాంటి మార్పులు లేవని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇక ఇదే సంక్రాంతికి రజినీకాంత్ దర్బార్ జనవరి 9న విడుదల అవుతుండగా, కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా జనవరి 15 న విడుదలవుతుంది.

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ రెండు సినిమాలు ప్రమోషన్ లో బిజీ అయిపోయాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలకి సంబందించిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ రిలీజ్ అయి సినిమా పైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి.. ఇక సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 5 న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇక అల ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో ఈ నెల 6 న నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories