మెహబూబా ఎఫెక్ట్ .. ఇస్మార్ట్ కి నో చెప్పిన దిల్ రాజు ?

మెహబూబా ఎఫెక్ట్ .. ఇస్మార్ట్ కి నో చెప్పిన దిల్ రాజు ?
x
Highlights

టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గానే కాదు .. డిస్ట్రిబ్యూటర్ కూడా దిల్ రాజుకి మంచి పేరుంది. అయన నుండి ఓ సినిమా వస్తుంది అన్నా , అయన ఓ సినిమాని డిస్ట్రిబ్యూట్...

టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గానే కాదు .. డిస్ట్రిబ్యూటర్ కూడా దిల్ రాజుకి మంచి పేరుంది. అయన నుండి ఓ సినిమా వస్తుంది అన్నా , అయన ఓ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్న ప్రేక్షకుల్లో సినిమా పైన మంచి అభిప్రాయాలే ఉంటాయి .. అందులో భాగంగానే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి నటించిన మెహబూబా సినిమాని స్వయంగా వీక్షించారు ఆయన .. సినిమా బాగుందని థియేట్రికల్ రైట్స్ ను తీసుకొని సినిమాని కూడా డిస్ట్రిబ్యూట్ చేసారు .. కానీ అ సినిమా దిల్ రాజుకి బాగా నష్టాలనే మిగిల్చింది ..

సినిమా నష్టాలు దిల్ రాజుకి పెద్ద విషయం కాదు .. మెహబూబా సినిమా బాగుందని అయన చెప్పిన మాటల వల్ల అయన జడ్జిమెంట్ పైన నమ్మకం పోయింది . ప్రస్తుతం పూరి హీరో రామ్ తో చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ నేల 18 న రిలీజ్ కి సిద్దం అవుతంది .. ఈ సినిమాని నైజం నుండి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తే సినిమా సేఫ్ అనే ఆలోచనలో పూరి ఉన్నాడట .. కానీ అందుకు దిల్ రాజు ఒప్పుకోలేదని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది . ఇప్పటివరకు దిల్ రాజు సినిమాని చూసింది కూడా లేదు . అంతే కాకుండా ఇస్మార్ట్ కి దిల్ రాజు ముందు నుండే దూరంగా ఉంటూనే వస్తున్నాడు .. ప్రస్తుతం దిల్ రాజు ని ఒప్పించే వ్యవహారం రామ్ పెద్దనాన్న స్రవంతి రవి కిషోర్ తీసుకున్నారని తెలుస్తుంది . మరి పూరి సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తారో లేదో చూడాలి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories