మహేష్ ఫాన్స్ కి దేవి భరోసా..

mahesh babu devi sri prasad
x
mahesh babu devi sri prasad
Highlights

మహేష్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్న తోలినాలల్లో మణిశర్మ ఎక్కువగా సంగీతం అందించేవాడు. ఆ తర్వాత తమన్ దూకుడు,బిజినెస్ మెన్, ఆగడు సినిమాలకి సంగీతం...

మహేష్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్న తోలినాలల్లో మణిశర్మ ఎక్కువగా సంగీతం అందించేవాడు. ఆ తర్వాత తమన్ దూకుడు,బిజినెస్ మెన్, ఆగడు సినిమాలకి సంగీతం అందించాడు. ఇక ఆ తర్వాత వన్ నేనొక్కడినే సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయింది. ఈ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోకపోయిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా మెప్పించింది. ఆ తర్వాత చేసిన శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన భరత్ అను నేను, మహర్షి సినిమాలు హిట్టు అయినప్పటికీ సంగీతం పరంగా అలరించుకోలేకపోయాయి.

ఇప్పుడు సరిలేరు నికేవ్వరు సినిమాతో మళ్ళీ వీరి కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. ఈ సినిమాకి దేవి మ్యూజిక్ అనగానే మహేష్ ఫాన్స్ అసహనం వ్యక్తం చేసారు.. అయితే ఈ సినిమాలోని ఓ మాస్ సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందని ,ఇక లవ్ సాంగ్ లవ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చిత్ర నిర్మాతలో ఒకరైన అనిల్ సుంకర చెప్పుకొచ్చారు. . దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసారు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories