వెంకీ సరసన 'ఢీ' షో జడ్జ్‌?

వెంకీ సరసన ఢీ షో జడ్జ్‌?
x
Venkatesh File photo
Highlights

గత ఏడాది F2, వెంకీమామ సినిమాలతో మంచి హిట్టు కొట్టిన విక్టరీ వెంకటేష్ ఇప్పుడు తమిళ్ లో హిట్టు అయిన అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు.

గత ఏడాది F2, వెంకీమామ సినిమాలతో మంచి హిట్టు కొట్టిన విక్టరీ వెంకటేష్ ఇప్పుడు తమిళ్ లో హిట్టు అయిన అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు. ఆ చిత్రాన్ని తమిళ్ లో హీరో ధనుష్ చేశాడు. వెట్రి మారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాని వెంకటేష్ రీమేక్ చేస్తుండగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో వెంకీ సరసన ప్రియమణి నటిస్తోందని తెలుస్తుంది. ఇప్పటికే కథ చర్చలు కూడా అయిపోయాయని, ఆమె కూడా ఈ పాత్రకు ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. అంతకు ముందు సీనియర్ హీరోయిన్ శ్రియ ఈ పాత్రను చేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రియమణి ఒకే అయిందని తెలుస్తోంది.అక్కడ మంజు వారియర్ ఆ పాత్రను పోషించారు.

కుల వ్యవస్థ దాని మూలంగా జరిగిన గొడవల ఆధారంగా అసురన్ సినిమాని తమిళ్ లో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాని వెంకటేష్ లాంటి హీరో చేస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రానా కూడా నటించనున్నాడని టాక్... ఈ ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories