ఈ నెల 29, బుధవారం రోజున నటుడు ప్రకాష్ రాజ్ ని హత మరిస్తామని హతమారుస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖను పంపారు.. ఇందులో ప్రకాష్ రాజ్...
ఈ నెల 29, బుధవారం రోజున నటుడు ప్రకాష్ రాజ్ ని హత మరిస్తామని హతమారుస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖను పంపారు.. ఇందులో ప్రకాష్ రాజ్ తో పాటు కర్ణాటక మాజీ సీఎం సీఎం కుమారస్వామి, నిజాగుణానంద స్వామి పేర్లు కూడా ఉన్నాయి . సంఘ్ పరివార్పై విమర్శులు గుప్పిస్తోన్న నిజగుణానందస్వామికి బెదిరింపులు లేఖ రాసిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఇందులో వీరి పేర్లను కూడా ప్రస్తావించారు.
ధర్మ ద్రోహులు, దేశద్రోహులను జనవరి 29న అంతంచేయడానికి ముహూర్తం నిర్ణయించాం.. మీ చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. నిజగుణానందస్వామీ! మీరు ఒక్కరే కాదు. దిగువ ఉన్న పేర్లను చూడండి. వారిని కూడా చివరి ప్రయాణానికి మీరే సిద్ధం చేయాలి' అని అందులో పేర్కొన్నారు. కన్నడలో ఉన్న ఈ లేఖను ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఇక మాజీ సీఎం సీఎం కుమారస్వామి కూడా తనకి బెదిరింపు కాల్స్ వచ్చాయని ట్వీట్ చేశారు. పోలీసులు అదనపు భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇంకా ఈ లేఖలో బజరంగ్ దల్ నేత మహేంద్ర కుమార్, నిజగుణానంద అసూరి స్వామి, నిడుమామిడి వీరభద్ర చెన్నమళ్లస్వామి, జ్ఞానప్రకాశ్ అసూరీ, నటుడు చేతన్ కుమార్, బీటీ లలిత్ నాయక్, మహేశ్చంద్ర గురు, భగవాన్, దినేశ్ అమైన్ మట్టు, చంద్రశేఖర్ పాటిల్, దుండి గణేశ్, రౌడి అగ్ని శ్రీధర్, బృందా కారత్, పేర్లు ఉన్నాయి.
A coward groups letter threatening that they will eliminate NIJAGUNANANDA SWAMY.. my name in the list too .. chalo #HumDekhenge ..#IndiaAgainstCAA_NRC #JustAsking pic.twitter.com/WOKbANls0q
— Prakash Raj (@prakashraaj) January 25, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire