సాయి ధరమ్ తేజ్ చేతుల మీదిగా 'కలర్ ఫోటో' సినిమా ప్రారంభం

సాయి ధరమ్ తేజ్ చేతుల మీదిగా కలర్ ఫోటో సినిమా ప్రారంభం
x
Highlights

కమెడియన్స్ హీరోలుగా మారడం అనేది కొత్తేమి కాదు. అప్పట్లో రాజబాబు నుంచి మొన్నోచ్చిన సుడిగాలి సుధీర్ వరకు అందరు హీరోలుగా నటించిన వారే.. ఇప్పుడు తాజాగా...

కమెడియన్స్ హీరోలుగా మారడం అనేది కొత్తేమి కాదు. అప్పట్లో రాజబాబు నుంచి మొన్నోచ్చిన సుడిగాలి సుధీర్ వరకు అందరు హీరోలుగా నటించిన వారే.. ఇప్పుడు తాజాగా మరో కమెడియన్ హీరోగా మారబోతున్నాడు. మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో మంచి కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. 'కలర్ ఫోటో' అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ సునీల్ విలన్ గా నటించనున్నాడు..

ఇందులో షార్ట్ ఫిలిం ద్వారా మంచి పేరు సంపాదించుకున్న తెలుగమ్మాయి చాందిని చౌదరీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ఈరోజు ( బుధవారం) పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో కేర్ ఆఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస్ చిత్ర దర్శకుడు స్వరూప్ క్లాప్ కొట్టారు. సునీల్ స్క్రిప్ ను అందించారు. ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, గోపి మోహన్, పవన్ సాదినేని తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమాకి సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా, 'మత్తు వదలరా' ఫేం కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలని నిర్మించిన అమృత ప్రొడక్షన్స్ ఈ సినిమాని లౌక్య ఎంటర్‌టై‌న్మెంట్స్ తో కలిసి నిర్మిస్తోంది. పక్కా కామెడీ ఎంటర్తైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాతో కమెడియన్ నుంచి సునీల్ విలన్ గా మారడంతో సినిమాపైన మంచి అంచనాలు పెరిగాయి. ఇప్పటివరకు కమెడియన్ గా, హీరోగా సక్సెస్ అయిన సునీల్ ఇప్పుడు విలన్ గా ఎ మేరకు ఆకట్టుకోగలడు అన్నది చూడాలి మరి. ప్రస్తుతం సునీల్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురుములో చిత్రంలో నటించాడు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలిజ్ చేయనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories