మహేష్ vs అల్లు అర్జున్ .. ఏంటి ఈ పోస్టర్ల గోల !

మహేష్ vs అల్లు అర్జున్ .. ఏంటి ఈ పోస్టర్ల గోల !
x
Highlights

2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి.. సాధారణంగానే పెద్ద హీరోల సినిమాలు అంటేనే అన్ని చోట్ల...

2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి.. సాధారణంగానే పెద్ద హీరోల సినిమాలు అంటేనే అన్ని చోట్ల నుంచి పోటి ఉంటుంది. అలాగే ఈ రెండు చిత్రాల మధ్య మొదటినుంచి పోటి నెలకొంది. సినిమా విడుదల తేదిల సమయంలో పోటి పడ్డాయి ఈ చిత్రాలు.. అ తర్వాత దిల్ రాజు సమక్షంలో చిత్ర నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చి జనవరి 11 న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, జనవరి 12 న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలను విడుదల చేశారు.

రెండు సినిమాలకి మంచి టాక్ రావడంతో కలెక్షన్ల దగ్గర వీపరితంగా పోటి పడ్డాయి ఈ రెండు చిత్రాలు. ఎక్కడ కూడా ఎవరు తగ్గకుండా రేసులో ఇద్దరు పోటిపడ్డారు.సినిమా తోలి రోజు సరిలేరు నీకెవ్వరు 46 కోట్లకుపైగా షేర్‌ సాధించినట్టుగా ప్రకటిస్తే, అల వైకుంఠపురములో షేర్‌ కాకుండా 85 కోట్ల గ్రాస్‌ అంటూ మరింత పెద్ద నంబర్‌తో పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇక సినిమా తొలి వారం తర్వాత సరిలేరు నీకెవ్వరు వంద కోట్లకు షేర్‌ సాధించినట్టుగా పోస్టర్ రిలీజ్ చేయగా, అల వైకుంఠపురములో సినిమా 6 రోజుల్లోనే 104 కోట్ల షేర్‌ సాధించినట్టుగా పోస్టర్‌ రిలీజ్ చేశారు. అంతేకాకుండా సరిలేరు నీకెవ్వరు పది రోజుల్లో 200 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా పోస్టర్‌ రిలీజ్ చేస్తే, అల వైకుంఠపురములో యూనిట్ ఆ మరుసటి రోజే 220 కోట్ల గ్రాస్‌ అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

ఇక నిన్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రం ఆల్‌ టైం ఇండస్ట్రీ హిట్ అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక అ ఈ రోజు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్ర నిర్మాతలు ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ గా ఏకంగా ప్రోమోనే విడుదల చేసారు. విడుదల తేదిల నుంచి కలెక్షన్ల వరకు ఇద్దరు ఎక్కడ కూడా తగ్గకుండా పోటిపడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల సినిమాలపై ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. సినిమా విజయాలను కూడా అనవసరంగా తక్కువ చేసే విధంగా ఫేక్ రికార్డుల వైపు వెళ్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories