Allu Arjun కొత్త సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్

Allu Arjun కొత్త సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
x
Highlights

ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే.

ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అయి అల్లు అర్జున్ లేకుండానే మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇక వచ్చే నెలలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో బన్నీ కూడా పాల్గొననున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో తమిళ నటుడు విజయ సేతుపతి విలన్ గా నటించనున్నాడని సమాచారం . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఎర్రచందనం, స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఎక్కువ భాగం శేషాచలం అడువుల్లోనే తీయనున్నారట. అయితే ఈచిత్రానికి సంబంధించి శేషాచలం అనే టైటిల్ ఓకే చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతొంది. అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్ కొట్టిపడేసింది. ఈ మూవీకి ఎటువంటి టైటిల్ ఖరారు చెయ్యలేదని చెప్పుకొచ్చింది. సినిమా టైటిల్ ఖరారు అవ్వగానే చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. అల్లు అర్జున్ కి ఇది 20వ సినిమా కాగా సుకుమార్ తో మూడో సినిమా.. ఆర్య, ఆర్య 2 లాంటి మంచి హిట్ల తరవాత వీరి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.

అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో చిత్రంలో నటించాడు. పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుక జనవరి 12 రిలీజ్ అయింది. మంచి హిట్ టాక్ సంపాదించుకుంది సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇందులో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్ధే హీరోయిన్ గా నటించింది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. తమన్ సంగీతం అందించాడు. టబు, సునీల్, సుశాంత్, నివేతా పెతురాజ్, మురళీశర్మ ముఖ్యపాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories