బెల్లంకొండ సినిమా నుంచి కెమరామెన్ అవుట్ !

బెల్లంకొండ సినిమా నుంచి కెమరామెన్ అవుట్ !
x
Highlights

సినిమాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. మొదటి సినిమానే స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో చేశాడు బెల్లంకొండ.

సినిమాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. మొదటి సినిమానే స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో చేశాడు బెల్లంకొండ.. ఈ సినిమా పెద్ద హిట్టు కాకపోయినప్పటికి బెల్లంకొండకి హీరోగా మంచి పేరునే తీసుకువచ్చింది. ఆ తర్వాత స్టార్ బెల్లంకొండ స్టార్ డైరెక్టర్ లతోనే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కానీ చెప్పుకునే హిట్టు అయితే పడలేదు.

ఇక గత ఏడాది తమిళ్ సినిమా అయిన రక్షాసన్ ని రాక్షసుడు అనే పేరుతో తెలుగులో తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో కథల ఎంపీకలో జాగ్రత్తలు వ్యవహరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు బెల్లంకొండ.. పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలుపెట్టింది. ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ బ్యూటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా కోసం బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డూడ్లేను ఎంపిక చేసింది చిత్రబృందం.. గతంలో ఆయన సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్‌వాలే లాంటి హిట్ చిత్రాలకు కెమరామెన్ గా పనిచేశారు. అయితే కొన్ని రోజులపాటు షూటింగ్ జరిగిన తర్వాత తాను పనిచేయలేని సినిమా నుంచి తప్పుకొన్నట్టు జాతీయ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని వెల్లడించింది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, డూడ్లేకి మధ్య వచ్చిన విభేదాలే దీనికి కారణమని ఆ పత్రిక వెల్లడించింది.

ఇప్పుడు ఈ సినిమా నుంచి డూడ్లే తప్పుకోవడంతో అతని స్థానంలో చోటా కే నాయుడుని తీసుకొన్నట్టు సమాచారం. కానీ దీనిపైన చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. కామెడీ అండ్ కమర్షియల్ బ్యాక్ గ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాపైన మంచి అంచనాలే ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories