ఆ సినిమా చూసి చిరంజీవి పడిపడినవ్వారట!

ఆ సినిమా చూసి చిరంజీవి పడిపడినవ్వారట!
x
Highlights

కేవలం హాస్య ప్రాధానమైన చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి తనకి తానే సాటి అనిపించుకున్నాడు హీరో రాజేంద్రప్రసాద్.

కేవలం హాస్య ప్రాధానమైన చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి తనకి తానే సాటి అనిపించుకున్నాడు హీరో రాజేంద్రప్రసాద్.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీ కెరియర్ ని మొదలు పెట్టిన రాజేంద్రప్రసాద్ ఆ తర్వాత హీరోగా మారి కామెడీ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం కో ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. తాజాగా అయన మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు ఎక్కువసేపు కనిపించేది రాజేంద్రప్రసాద్ మాత్రమే.. సినిమా ప్రమోషన్ లో భాగంగా 'అలీతో సరదాగా' అనే షోలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ తన సినీ కెరియర్ లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన లేడిస్ టైలర్ ఎంత పెద్ద హిట్ అయిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఓ పల్లెటూళ్ళో బట్టలు కుట్టే సుందరం పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపించారు. పూర్తి హాస్య ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. అయితే అప్పట్లో ఈ సినిమా ప్రివ్యూని మూడు సార్లు చూసిన మెగాస్టార్ చిరంజీవి పడిపడినవ్వారట.. ఈ సినిమా మెగాస్టార్ ని మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులును కూడా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి తనికెళ్ళ భరణి మాటలు రాయగా, స్రవంతి మూవీస్ సినిమాని నిర్మించింది. ఈ సినిమా తర్వాత రాజేంద్రప్రసాద్ మళ్ళీ వెనుకకి తిరిగి చూసుకుంది లేదు.

ఇక సరిలేరు నీకెవ్వరు విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ మొట్టమొదటిసారిగా ఆర్మీ లుక్ లో కనిపించారు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రాజేంద్రప్రసాద్, సంగీత, రావు రమేష్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మించారు. ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories