గొల్లపూడి పార్థివదేహానికి నివాళులర్పించిన చిరంజీవి

గొల్లపూడి పార్థివదేహానికి నివాళులర్పించిన చిరంజీవి
x
chiranjeevi, suhasini
Highlights

టాలీవుడ్ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. చెన్నైలోని

టాలీవుడ్ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. చెన్నైలోని గొల్లపూడి నివాసానికి వెళ్ళిన చిరంజీవి గొల్లపూడి మృతదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవితో పాటు నటి సుహాసిని కూడా గొల్లపూడి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ నేపద్యంలో చిరంజీవి గొల్లపూడితో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు.

"నేను 'ఐ లవ్యు' సినిమా చేస్తున్నప్పుడు.. డైలాగులు ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆ సినిమా కోసం అయన దగ్గర శిష్యరికం చేశాను, అయన నాకు గురువు లాంటి వారు. మేము ఇద్దరం కలిసి'ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య' సినిమాలో కలిసి నటించాము. అయనతో ఉన్న బంధుత్వం ఎప్పటికి చెరగనిది. అయన లేని లోటు సినిమా పరిశ్రమకి ఎప్పటికి తీరని లోటే.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చిరంజీవి అన్నారు.

ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడుగా కెరియర్ ని ప్రారంభించిన గొల్లపూడి మొదటి సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరవాత అయన వెనుకకి తిరిగి చూసుకుంది లేదు. డబ్బు భలే జబ్బు, సంసారం ఒక చదరంగం, అభిలాష లాంటి సినిమాల్లో నటించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న అయన గురువారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం శారదాంబల్‌లోని నివాసానికి ఆయన పార్థివదేహం చేరింది. సాయంత్రం నుంచి అభిమానుల సందర్శనార్థం ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అంత్యక్రియలు జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories