వర్మ సినిమాకు లైన్ క్లియర్

వర్మ సినిమాకు లైన్ క్లియర్
x
రామ్ గోపాల్ వర్మ
Highlights

సంచనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాకు లైన్ క్లియర్ అయిపొయింది. అయన తెరకెక్కించిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రివైజింగ్ కమిటీ.

సంచనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాకు లైన్ క్లియర్ అయిపొయింది. అయన తెరకెక్కించిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రివైజింగ్ కమిటీ. మొదటగా సెన్సార్ బోర్డు సినిమాని చూసి సర్టిఫికేట్ ఇవ్వలేమని చెప్పడంతో వర్మ రివైజింగ్ కమిటీని ఆశ్రయించాడు. కొన్ని కట్స్ ఇచ్చి ఈ సినిమాను విడుదల చేసుకోండి అంటూ వర్మకు ఊరటనిచ్చింది రివైజింగ్ కమిటీ.అక్కడి నుంచి సినిమాకి గ్రీన్ సిగ్నల్ రావడంతో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు విడుదలకి సిద్దం అయింది.

మొదటగా టైటిల్ విషయంలో వివాదాలు రావడంతో ఈ సినిమా టైటిల్ ని కమ్మ రాజ్యంలో కడప రెడ్ల నుంచి అమ్మరాజ్యంలో కడప బిడ్డలుగా మార్చారు వర్మ.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన అనంతరం జరిగిన తాజా పరిణామాల అనంతరం ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదల చేసిన రెండు ట్రైలర్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ని డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు . సినిమా విడుదలయ్యాక ఈ సినిమా మరిన్ని సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories