ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి..వాడు పోలీసోడు అయ్యుండాలి: నాని

ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి..వాడు పోలీసోడు అయ్యుండాలి: నాని
x
Highlights

దిశ కేసు నిందితుల‌ని ఎన్‌కౌంట‌ర్ చేయ‌డం ప‌ట్ల స‌ర్వత్రా హ‌ర్షం వ్యక్తం అవుతుంది. సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా ఈ ఘ‌ట‌న ప‌ట్ల సంతోషం వ్యక్తం...

దిశ కేసు నిందితుల‌ని ఎన్‌కౌంట‌ర్ చేయ‌డం ప‌ట్ల స‌ర్వత్రా హ‌ర్షం వ్యక్తం అవుతుంది. సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా ఈ ఘ‌ట‌న ప‌ట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దిశా నిందితులఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హీరో జూనియర్ ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దిశకు న్యాయం జరిగింది, ఆమె ఆత్మకు శాంతి చేకూరింది అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలిపారు. దేశంలో అత్యాచారాలకు ముగింపు ఎప్పుడు జరిగితుందోనని ఆవేదన వ్యక్తం చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన నాని.. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడు అయ్యుండాలి అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories