జొన్నవిత్తులపై కేసు నమోదు

జొన్నవిత్తులపై కేసు నమోదు
x
Highlights

ప్రముఖ తెలుగు గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మార్చి 23న ఓ టీవీ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న...

ప్రముఖ తెలుగు గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మార్చి 23న ఓ టీవీ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న జొన్నవిత్తుల ఎస్సీ, ఎస్టీల మనోభావాలు కించపరిచేలా ఓ పద్యం పాడారని, అంటరానితనాన్ని కొనసాగించాలనే అర్థం ఆ పద్యంలో ఉందని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అంటరానితనాన్ని కొనసాగించాలనేలా ఆయన మార్చి 23న కరోనాపై పద్యం పాడారని, ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి రోజునే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేశారని బత్తుల రాంప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో న్యాయ నిపుణుల సలహాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు చెప్పారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories