హిట్టు కొట్టి 'పండగ' చేసుకుంటున్నమారుతి

హిట్టు కొట్టి పండగ చేసుకుంటున్నమారుతి
x
Highlights

తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేస్తూ హిట్టు కొట్టడం, నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టడంలో దర్శకుడు మారుతికి వెన్నతో పెట్టిన విద్య.. బస్ స్టాప్, ప్రేమ కథ...

తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేస్తూ హిట్టు కొట్టడం, నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టడంలో దర్శకుడు మారుతికి వెన్నతో పెట్టిన విద్య.. బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం, భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలు చిన్న బడ్జెట్ తో వచ్చి పెద్ద సక్సెస్ అయిన సినిమాలే.. తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా అయన ప్రతి రొజూ పండగే అనే సినిమాని తెరకెక్కించాడు.

ఈ సినిమాని గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించగా తమన్ సంగీతం అందించాడు. రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. రావు రమేష్, సత్యరాజ్ ముఖ్యపాత్రల్లో కనిపించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ మెకానికల్ లైఫ్‌కి అలవాటు పడిపోయిన పిల్లలు తమ తల్లితండ్రులని పట్టించుకోకుండా ఎంత అశ్రద్ధ వహిస్తున్నారు. దీని వల్ల ఆ తల్లితండ్రులు ఎంత అల్లాడిపోతున్నారు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న రిలీజ్ అయి మంచి హిట్టును సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా నిలబడింది.

పెట్టిన బడ్జెట్ కి ఈ సినిమా 10 కోట్లకు పైగా లాభాలు అందించింది. ఇప్పటికి కూడా మంచి కలెక్షన్స్ తోనే రన్ అవుతుంది. సినిమా మంచి హిట్టు కావడంతో యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, విక్కీ, ప్రమోద్ కలిసి రేంజ్ రోవర్ వెలార్ కారును మారుతికి బహుకరించారు. అంతకుముందు భలే భలే మగాడివోయ్ సినిమా కూడా మంచి హిట్టు కావడంతో యువీ క్రియేషన్స్ వారే మారుతికి జాగ్వార్ కారును మారుతికి బహుమతిగా అందించారు.

ఇక తన తదుపరి చిత్రాన్ని కూడా మారుతి యువీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 లోనే తీయనున్నట్లు తెలుస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories