నిద్ర పట్టటం లేదు.. కత్రినా కైఫ్

నిద్ర పట్టటం లేదు.. కత్రినా కైఫ్
x
Highlights

భారత్ సినిమా విడుదల కోసం తలుచుకుంటే నిద్ర కూడా పట్టటం లేదు అంటోంది బాలీవుడ్‌ బార్బీగర్ల్‌ కత్రినా కైఫ్. కొరియన్‌ సినిమా 'ఓడ్‌ టు మై ఫాదర్‌'కు హిందీ...

భారత్ సినిమా విడుదల కోసం తలుచుకుంటే నిద్ర కూడా పట్టటం లేదు అంటోంది బాలీవుడ్‌ బార్బీగర్ల్‌ కత్రినా కైఫ్. కొరియన్‌ సినిమా 'ఓడ్‌ టు మై ఫాదర్‌'కు హిందీ రీమేక్‌ గా నిర్మించిన భరత్ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో సల్మాన్ ఖాన్. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా దిశా పటానీ నటిస్తోంది.

ఈ సినిమా విడుదల సందర్భంగా కత్రినా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. 'భారత్' విషయంలో చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నా. సినిమాను ప్రజలకు తొందరగా చూపించాలని ఉంది. వారి స్పందన తెలుసుకోవాలని ఉంది. సినిమాను తెరకెక్కించిన తీరు విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నా. సినిమా బాక్సాఫీసు వద్ద ఎంత వసూలు చేస్తుందో ముందే ఊహించడం కష్టమైన పని. ఎప్పటిలాగే ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ మాకు దక్కుతుందని ఆశిస్తున్నా' అని కత్రినా చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories