శభాష్ : కరోనా రోగులకి సేవ చేస్తున్న బాలీవుడ్ నటి

శభాష్ : కరోనా రోగులకి సేవ చేస్తున్న బాలీవుడ్ నటి
x
Shika Malhotra
Highlights

రోజురోజుకు కరోనా దేశంలో తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికి దేశంలో వేయికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

రోజురోజుకు కరోనా దేశంలో తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికి దేశంలో వేయికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 25 మంది మృతి చెందారు. ఇక దీనిపైన సెలబ్రిటీలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఒక్కరు సినీ కార్మికుల కోసం డబ్బులు విరాళంగా ఇస్తుంటే మరికొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళంగా ఇచ్చారు. ఇంకా కొందరు సోషల్ మీడియాలో కరోనాపై అవగహన పెంచుతున్నారు. కానీ బాలీవుడ్ నటి నటి శిఖా మల్హోత్రా మాత్రం ఓ వినుత్నమైన పనిని ఎంచుకొని అందరితో శభాష్ అనిపించుకుంటుంది.

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ నటించిన 'ఫ్యాన్' అనే సినిమాలో శిఖా మల్హోత్రా ఓ కీలక పాత్ర పోషించింది. ఆ పాత్ర ఆమెకి మంచి గుర్తింపును తీసుకువచ్చింది. అయితే దేశసేవ కోసం ముంబైలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా మారి కోవిడ్-19తో పోరాతున్న భాదితులకి చికిత్స అందిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

" నేను ఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీలో శిఖా నర్సింగ్ కోర్సును పూర్తి చేశాను.. అప్పుడు నా సేవలను మీరు గుర్తించారు. అయితే ఇప్పుడు దేశానికి సేవ చేసే అవసరం వచ్చింది. ప్రస్తుతం ముంబై ఓ ఆస్పత్రిలో విధుల్లో చేరి నర్స్‌గా పనిచేస్తున్నాను. నాకు తోచినంతగా సహాయం చేయండి. నన్ను ఆశీర్వదించండి ఇంటి వద్ద సురక్షితంగా ఉండి ప్రభుత్వానికి సహకరించండి" అంటూ పోస్ట్ చేసింది. శిఖా మల్హోత్రా నటిగానే కాకుండా సింగ‌ర్‌గాను, టీవీ ప్రెజెంట‌ర్‌గాను ప‌నిచేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories