గొప్పమనసు చాటుకున్న కంగనా : పది లక్షల విరాళం

గొప్పమనసు చాటుకున్న కంగనా : పది లక్షల విరాళం
x
Kangana Ranaut (File Photo)
Highlights

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వచ్చేసరికి షూటింగ్ లు వాయిదా పడ్డాయి.

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వచ్చేసరికి షూటింగ్ లు వాయిదా పడ్డాయి. దీనితో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ క్రమంలో వారిని ఆడుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం (సీసీసీ)ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఛారిటీ కి తమ వంతు సాయంగా పలువురు హీరోలు విరాళాలు ప్రకటించి తమ ఉదారతను చాటుకుంటున్నారు.

ఇక టాలీవుడ్‌లోనే లాగే ఇతర సినీ ఇండస్ట్రీలలో కూడా పేద సినీ కార్మికులను ఆదుకునేందుకు అక్కడి ఫెడరేషన్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ రూ. 10 లక్షల విరాళం ప్రకటించింది. ఇందులో రూ. 5 లక్షలు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్‌ ఇండియా (ఫెఫ్సీ)కి, మరో రూ. 5 లక్షలు ప్రస్తుతం తను చేస్తున్న 'తలైవి' చిత్రం కోసం పనిచేస్తున్న కార్మికులకు ఆమె విరాళంగా అందించి గోప్ప మనసును ప్రకటించింది.

ఇక ప్రస్తుతం కంగనా దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి 'తలైవి' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహిస్తుండగా, విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాని జూన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories