అవును ప్రభాస్ సినిమా చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన నటి!

అవును ప్రభాస్ సినిమా చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన నటి!
x
bollywood actress Bhagyashree(File photo)
Highlights

'మైనే ప్యార్ కియా' అప్పట్లో బాలీవుడ్ ని షేక్ చేసిన సినిమా ఇది.. ఇప్పటికి ఈ సినిమాకి హార్డ్ కొర్ ఫాన్స్ ఉన్నారు.

'మైనే ప్యార్ కియా' అప్పట్లో బాలీవుడ్ ని షేక్ చేసిన సినిమా ఇది.. ఇప్పటికి ఈ సినిమాకి హార్డ్ కొర్ ఫాన్స్ ఉన్నారు.. ఈ సినిమా ద్వారా సల్మాన్ ఖాన్ కి ఎంత మంచి పేరు వచ్చిందో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ కూడా అంతే స్టార్ ఇమేజ్ వచ్చింది. అయితే గత కొద్దిరోజులుగా సినిమాలకి దూరంగా ఉన్న భాగ్యశ్రీ మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకుంటుందట.. అందులో భాగంగానే రెండు స్క్రిప్ట్ లకు ఒకే చెప్పిందట..తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే ఆ రెండు స్క్రిప్ట్ లలో ఒకటి ప్రభాస్ సినిమా అని రివీల్ చేసింది.

సాహో సినిమా తర్వాత ప్రభాస్ జిల్ ఫేం కె రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. ఇది ప్రభాస్ 21 చిత్రం కావడం విశేషం.. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రకు గాను మేకర్స్ బాలీవుడ్ నటి భాగ్యశ్రీని ఓకే చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఎవరు కూడా క్లారిటీ ఇచ్చింది లేదు. ఇక తాజాగా నటి భాగ్యశ్రీ దీనిపైన స్పందిస్తూ .. అవును ప్రభాస్ సినిమాలో నటిస్తున్నానని వెల్లడించింది.

పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుండడంతో భారీ కాస్ట్ ని తీసుకుంటున్నారు మేకర్స్. ఇక బాలీవుడ్ నుంచి విలన్స్ కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ కి ముందు విదేశాల్లో భారీ యాక్షన్ సీన్స్ ని షూట్ చేసుకొని వచ్చింది చిత్ర బృందం.. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.. సినిమాని దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు ఒకే చెప్పారు. సీ అశ్వనీదత్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories